రాష్ట్ర జిడిపిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ)ల వాటా పది శాతం ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ఎంఎస్ఎంఇ నూతన పాలసీని రూపొందించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం నాడు ఆయన శంషాబాద్లో ఏర్పాటైన గో-నేషనల్- ఎక్స్ పో 2025 ఐదో ద్వైవార్షిక సదస్సును ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. దాదాపు 4 వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సదస్సును బిజినెస్ నెట్ వర్క్ ఇంటర్నేషనల్ (బిఎన్ఐ) నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ప్రదర్శనతో పాటు వివిధ అంశాలపై సదస్సులు జరుగుతాయి. మంత్రి మాట్లాడుతూ నూతన సాంకేతికత, డిజిటలైజేషన్లతో ఎంఎస్ఎంఇలు ఎప్పటికప్పుడు ఆధునీకరించుకునేలా తమ ప్రభుత్వం సహకరిస్తోందని శ్రీధర్ బాబు వివరించారు. తక్కువ వడ్డీతో రుణ సదుపాయం, నిధుల సమీకరణకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తున్నట్టు తెలిపారు.
Also Read: ‘జూబ్లీ’ రేసులో నేనూ ఉన్నా: మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్