Sunday, September 14, 2025

అద్భుతాల నిల‌యం శ్రీవారి ఆలయం

- Advertisement -
- Advertisement -

భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన మండ‌పాలుశిల్పాలు

తిరుమలతిరుమల శేషాచలగిరుల్లో వెలసిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయిఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా శాస‌నాల ద్వారా తెలుస్తోందిఆలయంలో ఆభరణాలుపవిత్రమైన వస్త్రాలుతాజా పూలమాలలుచందనం తదితరాలను భద్రపరుచుకోవడానికి వేర్వేరుగా గదులున్నాయివీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటుశ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంటగదులున్నాయి. శ్రీవారి ఆలయం అభివృద్ధికి ఎన్నో రాజవంశాలకు చెందిన రాజులురాణులుసేనాధిపతులుఇంకెందరో భక్తులు ఇతోధికంగా విరాళాలు అందించి సహకరించారుఅద్భుత నిర్మాణమైన శ్రీవారి ఆలయంలో పలు ఉప ఆలయాలుమండపాలు కొలువుదీరాయి.

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని మండ‌పాల‌ను ఆనాటి చ‌క్ర‌వ‌ర్తులురాజులు అద్భుత‌మైన శిల్ప క‌ళా నైపుణ్యంతో నిర్మిచారుఇందులో మ‌హాద్వారంకృష్ణరాయమండపంరంగనాయక మండపంతిరుమలరాయ మండపంఅద్దాల మండపం – ఆఐనా మహల్‌ధ్వజస్తంభ మండపంకళ్యాణ మండపం త‌దిత‌రాలు ఉన్నాయిఇక్క‌డ ఉన్న పైక‌ప్పుస్థంభాల‌పై కృష్ణ‌స్వామివారుల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివ‌రాహ‌స్వామిశ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి త‌దిత‌ర దేవ‌తా మూర్తులుల‌క్ష్మీదేవి అమ్మ‌వారి వివిధ రూపాలుజంతువులుల‌త‌లుపుష్పాల‌తో కూడిన శిల్పాల‌తో నిర్మించారు. ప్ర‌ధాన గోపురం లేదా మ‌హాద్వారమును 13వ శ‌తాబ్ధంలో నిర్మించిన‌ట్లు ఆల‌యంలోని శాస‌నాల ద్వారా తెలుస్తోందిఇక్కడే కుడిగోడపై అనంతాళ్వారులు ఉపయోగించిన గునపం వ్రేలాడదీయబడి ఉంటుంది.

కృష్ణరాయమండపం :

మహాద్వారానికి ఆనుకొని లోపలి వైపు 16 స్థంభాల‌పై ముస‌లిపై ఉన్న సింహందానిపై కుర్చుని స్వారి చేస్తున్న వీరుల శిల్పాల‌తో కూడిన ఎతైన మండపమే కృష్ణరాయమండపంఈ మండ‌పంలో కుడివైపున తిరుమల దేవిచిన్నాదేవిలతో కూడిన శ్రీకృష్ణదేవ‌రాయల నిలువెత్తు రాగి ప్రతిమలుఎడమవైపు చంద్రగిరి రాజైన వెంకటపతి రాయల రాగిప్రతిమఆ పక్కన విజయనగర ప్రభువైన అచ్యుతరాయలుఆయన రాణి వరదాజి అమ్మాణ్ణి వీరి నిలువెత్తు నల్లరాతి ప్రతిమలు నమస్కార భంగిమలో ఉన్నాయి.

రంగనాయక మండపం :

శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల‌ మండపాన్ని శ్రీరంగనాథ యాదవ రాయలు క్రీ. 1310 – 1320 మధ్య కాలంలో నిర్మించారుఈ మండ‌మంలో వివిద‌ రకాల శిల్పాలతో సుందరంగా మండప‌ నిర్మాణం జరిగిందిక్రీ. 1320 – 1360 మ‌ధ్య కాలంలో శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు ఈ మండపంలో భద్రపరిచారుఅందువల్లే దీన్ని రంగనాయక మండపమని పిలుస్తున్నారు.

తిరుమలరాయ మండపం :

రంగనాయక మండపాన్ని అనుకుని పడమర వైపునకు ఉన్న ఎత్తయిన స్తంభాల మండపమే ఊంజ‌ల్‌మండ‌పం లేదా తిరుమలరాయ మండపం అంటారుఈ మండపంలోని వేదిక భాగాన్ని క్రీ.. 1473లో సాళువ నరసింహరాయలు నిర్మించగాక్రీ..16వ శ‌తాబ్ధంలో సభాప్రాంగణ మండపాన్ని ఆర‌వీటి తిరుమలరాయలు నిర్మించాడుఇందులోని స్థంభాల‌పై శ్రీ వైష్ణ‌వప‌శుపక్షాదుల‌ శిల్పాలు ఉన్నాయిఈ మండపంలో రాజా తోడ‌ర‌మ‌ల్‌అత‌ని త‌ల్లి మాతా మోహ‌నా దేవిభార్య పిటా బీబీ లోహ విగ్ర‌హ‌లు ఉన్నాయి. బ్రహ్మోత్సవ సమయంలో ధ్వజారోహణం నాడు శ్రీవారు ఈ మండపంలోనికి వేంచేసి పూజలందుకుంటారు.

అద్దాల మండపం – ఆఐనా మహల్‌ :

కృష్ణరాయ మండపానికి ఉత్తరం దిక్కున ఉన్నదే అద్దాల మండపం లేదా ఆఐనా మహల్ అంటారుదీనిని 36 స్థంభాల‌తో అద్భుతంగా నిర్మిచారుఇందులో మందిరంఅంత‌రాళంగ‌ర్భ‌గృహం ఉన్నాయిఇక్క‌డ ప్ర‌తి రోజు స్వామివారికి డోలోత్స‌వం నిర్వ‌హిస్తారు.

ధ్వజస్తంభ మండపం :

రెండ‌వ గోపుర‌మైన వెండి వాకిలిని తాకుతూ ధ్వజస్తంభ మండపాన్ని క్రీ. 1470లో విజ‌య‌న‌గ‌ర చ‌క్ర‌వ‌ర్తి సాళువ న‌ర‌సింహ‌రాయులు నిర్మించారు. 10 రాతి స్థంభాల‌తో నిర్మిచిన మండ‌పంలో బంగారు ధ్వజస్తంభంబలిపీఠం ఉంటాయిఈ స్థంభాల‌పై వివిద దేవ‌తామూర్తుల శిల్పాలుఇంకా సృష్ఠికి సంబంధించిన స్త్రీపురుషుల సంబంధాల‌ను తెలిపే అనేక శిల్పాలు పొందుప‌రిచారుప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారుదీన్నే ధ్వజారోహణం అంటారు. ధ్వజస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠంశ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.

వసంత మండపం: 

తిరుమల శ్రీవారి ఆలయానికి మహాప్రదక్షిణ మార్గంలో నైరుతిమూలలో వసంత మండపం ఉంది.

కళ్యాణ మండపం :

శ్రీ‌వారి గ‌ర్భాల‌యానికి దక్షిణంవైపు క్రీ.శ‌.1586లో శ్రీ అవ‌స‌రం చెన్న‌ప్ప అనే నాయ‌కుడు క‌ల్యాణ మండ‌పాన్ని నిర్మించారు. 80 అడుగుల పొడుగు, 30 అడుగుల వెడ‌ల్పుతో 27 స్థంబాల‌తో నిర్మించారుఇందులో మ‌ధ్య‌ భాగంలో నాలుగు చిన్న స్తంభాలు ఉన్న గ్రానైట్ వేదిక ఉన్నదిపూర్వ‌కాలంలో ఈ కల్యాణ వేదికపై శ్రీ మలయప్పస్వామి వారికిశ్రీదేవి భూదేవిలకు కల్యాణోత్సవం నిర్వ‌హించేవారు.

తిరుమామణి మండపం : 

బంగారు వాకిలికి గరుడ సన్నిధికి మధ్యగల ప్రదేశంసుప్రభాత సేవలో భక్తులు ఇక్కడి నుండే శ్రీ‌వారి సేవ‌లో పాల్గొంటారు.

స్నపన మండపం :

బంగారువాకిలి దాటి లోపలికి వెళ్లిన వెంటనే ఉండేదే ‘స్నపనమండపం’. క్రీ..614లో పల్లవరాణి సామవై ఈ మండపాన్ని నిర్మించిభోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని సమర్పించిందిఈ స్నపనమండపాన్నే తిరువిలాన్‌ కోయిల్‌ అంటారుఆనందనిలయం జీర్ణోర్ధరణ సమయంలో ఈ మండపం నిర్మించబడిందని చెబుతారు.

రాములవారి మేడ  :

స్నపనమండపం దాటగానే కుడివైపు ఎత్తుగా కనిపించేదే ”రాములవారిమేడ”. తమిళంలో మేడు అంటే ఎత్తయిన ప్రదేశం అని అర్థంఇక్కడ రాములవారి పరివారమైన అంగదహనుమంతసుగ్రీవుల విగ్రహాలున్నాయిప్రస్తుతం ఆనందనిలయంలో ఉన్న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఇక్కడ ఉండేవనిఅందువల్లే ఇది రాములవారి మేడ అని పిలువబడుతోంది అని కూడా అంటారు.

శయనమండపం :

రాములవారి మేడ దాటి లోపల ప్రవేశించిన వెంటనే ఉన్న గదే శయనమండపంశ్రీవేంకటేశ్వరస్వామివారు వెలసిన గర్భాలయానికి ముందున్న అంతరాళమే శయనమండపంప్రతిరోజూ ఏకాంత సేవ ఈ మండపంలో వెండి గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంమీద శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు.

కుల శేఖరపడి :

శయనమండపానికిశ్రీవారి గర్భాలయానికి మధ్యన రాతితో నిర్మించిన ద్వారబంధం ఉందిఅదే కులశేఖరప‌డిపడి అనగా మెట్టుగడప అని అర్థం.

గర్భాలయం :

కులశేఖరపడి అనే బంగారు గడపను దాటితే ఉన్నదే శ్రీవారి గర్భాలయంశ్రీవేంకటేశ్వర స్వామివారు స్వయంభువుగా సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించి ఉన్నచోటే గర్భాలయందీనినే ”ఆనంద నిలయం” అంటారుఈ ఆనంద నిలయంపై ఒక బంగారు గోపురం నిర్మించబడిందిదీనినే ఆనందనిలయ విమానం అంటారు.

శ్రీ వేంకటేశ్వరస్వామి (మూలవిరాట్టు) :

గర్భాలయంలో స్వయంవ్యక్తమూర్తిగా నిలిచివున్న దివ్యమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామినిలబబడివున్నందున ఈ ఆర్చామూర్తిని ”….స్థానకమూర్తి….” అంటారుఅంతేగాక స్థిరంగా ఉన్నందువల్ల ”….ధ్రువమూర్తి….” అని, ”ధ్రువబేరం” అని కూడా అంటారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News