Monday, September 15, 2025

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

- Advertisement -
- Advertisement -

లిపర్‌పూల్: ప్రపంచబాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతాకం లభించింది. 48 కిలోల విభాగంలో మీనాక్షి హుడా (Minakshi Hooda) బంగారు పతకం సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కజికిస్థాన్‌కు చెందిన నాజిమ్ కైజైబేపై 4-1 స్ల్పిట్ డెషిషన్‌తో మీనాక్షి విజయం సాధించింది. కాగా, పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతాకం సాధించిన నాజిమ్‌కి భారత బాక్సర్ మీనాక్షి గట్టి పోటీ ఇచ్చింది. తొలి రౌండ్లో ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. దీంతో తొలి రౌండ్‌ను 4-1తో సొంతం చేసుకుంది.

కానీ, రెండో రౌండ్‌లో నాజిమ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. రెండో రౌండ్‌లో మీనాక్షిపై (Minakshi Hooda) 3-2 తేడాతో విజయం సాధించింది. మూడో రౌండ్ హోరాహోరీగా సాగింది. కానీ, ఈ రౌండ్‌లో ఎవరూ నిర్ణీత సమయంలో పాయింట్ సాధించలేకపోయారు. దీంతో నలుగురు జడ్జిలు మీనాక్షికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో మీనాక్షి 4-1 తేడాతో విజయం సాధించింది స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ లంబోరియా 57 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది.

Also Read : తొలి వన్డేలో రాణించిన భారత్.. ఆసీస్‌ల టార్గెట్ ఎంతంటే..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News