Monday, September 15, 2025

శ్రీ వేదాక్షర మూవీస్ ద్వారా ‘ఇడ్లీ కొట్టు’

- Advertisement -
- Advertisement -

కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరో, డైరెక్టర్‌గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిలమ్స్ బ్యానర్స్‌పై ఆకాష్ బాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌గా ధనుష్‌కి ఇది నాలుగో మూవీ. ఈ చిత్రం తెలుగు, తమిళ్‌లో ఒకేసారి అక్టోబర్ 1న రిలీజ్ కానుంది. చాలామంది ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పోటీ పడ్డారు. ఫైనల్‌గా ధనుష్ కెరీర్‌లోనే భారీ మొత్తానికి శ్రీ వేదక్షర మూవీస్ తెలుగు రైట్స్‌ని దక్కించుకుంది.

శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్ ద్వారా నిర్మాత రామారావు చింతపల్లి తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. నిర్మాత రామారావు చింతపల్లి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాని అక్టోబర్ 1న ధనుష్ కెరీర్‌లోనే ఎక్కువ థియేటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఈ సినిమా తెలుగు రైట్స్ మాకు ఇచ్చినందుకు ధనుష్‌కి, టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము’ అని అన్నారు. నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : ‘ది ప్యారడైజ్’లో కీలక పాత్ర..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News