- Advertisement -
అమరావతి: రాజకీయ అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎపి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అర్థరహితం అని అన్నారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గతంలో ఏం చెప్పారో జగన్ కు గుర్తు లేదని, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అని చంద్రబాబుపై విమర్శలకు మతి పోయిందని మండిపడ్డారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. ఏ సమస్యపై ప్రశ్నించిన సమాధానం చెబుతాం అని తెలియజేశారు. కనీసం సమస్య చెప్పుకునే పరిస్థితిలో కూడా జగన్ లేరని ఆనం రామనారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు.
Also Read : ఎకో టూరిజంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి: చంద్రబాబు
- Advertisement -