Thursday, September 18, 2025

అమెరికా నేతలు అవినీతిపరులు.. పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: ఓ పక్క పాక్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటుంటే.. మరోవైపు ఆయన మంత్రివర్గ సభ్యులు మాత్రం అగ్రరాజ్యాన్ని ఇరుకున పడేస్తున్నారు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతలు అవినీతి పరులని, వారు ఇజ్రాయెల్ నుంచి లంచాలు స్వీకరిస్తున్నారని ఆరోపించారు. పాక్‌కు చెందిన జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ఆసిఫ్ మాట్లాడుతూ “ మేము లంచాలు స్వీకరించామని తీవ్ర అపవాదులు ఎదుర్కొన్నాం. కానీ అమెరికా రాజకీయ నాయకులు ఇజ్రాయెల్ నుంచి బహిరంగంగానే లంచాలు తీసుకున్నారు. అదే నేను లంచం స్వీకరించాల్సి వస్తే… ఎక్కడో చాటుగా తీసుకుంటాను. మేము నిందలు మోశాం. కానీ వారు బహిరంగంగానే చేస్తున్నారు” అని అన్నారు. అమెరికా మిలిటరీ అధికారులు, ప్రతినిధుల సభ సభ్యులు, ఉన్నత స్థాయి పాలకులు తాము ఇజ్రాయెల్ నుంచి నిధులు అందుకున్నట్టు అంగీకరించారన్నారు.

ట్రంప్‌నకు షాకిచ్చిన ఇషాక్‌దార్!
మరోవైపు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్‌దార్ ఏకంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకే షాక్ ఇచ్చారు. భారత్ ఎప్పుడూ మూడోదేశం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదన్నారు. ఆయన అల్ జజీరాతో మాట్లాడుతూ “ మూడో పక్షం పాత్ర ఉన్నా మేము ఏమీ అనుకోం. ఇది ద్వైపాక్షిక అంశమే అని భారత్ పేర్కొంది. సరే ఏ చర్చలు జరిగినా ఉగ్రవాదం, వాణిజ్యం, జమ్ముకశ్మీర్‌పై సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉంది ” అని పేర్కొన్నారు. “ మే 10వ తేదీన సీజ్ ఫైర్ ఆఫర్ వచ్చిన వేళ.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ పాక్ చర్చలు తటస్థ వేదికగా జరుగుతాయన్నారు. కానీ జులై 25న దీనిపై నేను మళ్లీ ఆయనను ప్రశ్నించాను. దీనికి రూబియో స్పందిస్తూ భారత్ ద్వైపాక్షిక అంశంగానే దీనిని చూస్తోందని తేల్చి చెప్పింది ” అని పేర్కొన్నారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసి మునీర్ త్వరలోనే అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో పాక్ మంత్రుల ప్రకటనలు వారిని ఇబ్బందుల్లో పడేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News