కంటెంట్ను నమ్మి రాబోతున్న చిత్రం ఒక బృందావనం. ( A Brindavanam) నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్, ఇతర సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటించారు. బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్ తాటికొండ, వెంకట్ రేగట్టే, ప్రహ్లాద్ బొమ్మినేని, మనోజ్ ఇందుపూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రీ మూవీస్ ద్వారా ఈ నెల 23న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరీలీజ్ వేడుక మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కథానాయకుడు నారా రోహిత్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, నిర్మాత సాహు గారపాటి, దర్శకుడు వీఎన్ ఆదిత్యలు విశిష్ట అతిథిలుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ “ఇదొక ఆసక్తికరమైన ఫీల్గుడ్ ఫిల్మ్. ఇదొక ఓ అబ్బాయి లైఫ్ జర్నీ. ఈ సినిమా అందరికి మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. నిర్మాత కిషోర్ తాటికొండ మాట్లాడుతూ “ఈ మూవీ మ్యూజికల్ జర్నీ. బ్యూటిఫుల్ విజువల్స్ ఉంటాయి. ఎలాంటి అహింస తావు లేకుండా రూపొందిన ఫీల్గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అందరూ కుటుంబంతో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది”అని పేర్కొన్నారు. హీరో బాలు మాట్లాడుతూ “దర్శకుడు సినిమాను ఎంతో బాగా తెరకెక్కించాడు. చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో షిన్నోవా, మనోజ్ ఇందుపూరు, సాకేత్, కె నల్లి తదితరులు పాల్గొన్నారు.