ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ (Team India) ఓటమిపాలైన విషయం తెలిసిందే. బ్యాటింగ్లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. బౌలర్లు విఫలం కావడంతో భారత్కు ఓటమి తప్పలేదు. ఇక బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో జరిగే రెండో టెస్ట్ కోసం భారత్ సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి తమ సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్కి ముందు భారత్ను ఓ రికార్డు కలవరపెడుతోంది.
ఇప్పటివరకూ ఈ వేదికపై ఏడు టెస్ట్ మ్యాచులు ఆడిన భారత్ (Team India) ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేదు. కపిల్ దేవ్ నేతృత్వంలో ఒక మ్యాచ్ డ్రాగా ముగియగా.. మిగితా ఆరు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా గెలిచి చరిత్రను తిరగరాయాలని భారత జట్టు భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్లో ముందు భారత మరో సమస్యను ఎదురుకోనుంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఈ మ్యాచ్లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశం ఉంది. బుమ్రా లేని పక్షంలో ఇంగ్లండ్ బ్యాటర్లు మరింత చెలరేగవచ్చు. మరి అతని స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారనే విషయంపై సందిగ్ధత నెలకొంది.