జస్ప్రీత్ బుమ్రాపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించారు. ఐపిఎల్ 2025లో భాగంగా నిన్న ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ముంబయి నిర్ధేశించిన లక్ష్య ఛేదనలో గుజరాత్ ధీటుగా సమాధానం ఇస్తూ విజయం దిశగా దూసుకుపోతుండగా.. బుమ్రా ఝలకిచ్చాడు. కీలక సమయంలో వాషింగ్టన్ సుందర్(48)ను క్లీన్ బౌల్డ్ చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీనిపై డివిలియర్స్ స్పందిస్తూ బుమ్రాపై ప్రశంసలు కురిపించారు.
తన కుమారుడితో మ్యాచ్ చూస్తున్న డివిలియర్స్.. సుందర్ వికెట్ తీసిన తర్వాత, ‘బుమ్రా బౌలింగ్ కోటా పూర్తికానంత వరకూ మ్యాచ్ ముగియనట్లే’ అని కుమారుడితో అన్నట్లు తెలిపాడు. బుమ్రా అద్భుతమైన బౌలర్ అని, కీలక సమయంలో మ్యాచ్ ను తమవైపుకు తిప్పుకునేలా బౌలింగ్ వేసే సత్తా తనకు ఉందని కొనియాడాడు. కాగా, నిన్న జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై ముంబయి 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో ఎలిమినేటర్ మ్యాచ్ లో జూన్ 2న పంజాబ్ కింగ్స్ తో ముంబయి తలపడనుంది.