Saturday, June 14, 2025

కెటిఆర్‌కు మరోసారి ఎసిబి నోటీసులు.. సిఎంకు సవాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు (KTR) ఎసిబి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మే26నే ఈ కేసులో విచారణకు రావాలని ఎసిబి (ACB) నోటీసులు ఇచ్చింది. కానీ, విదేశీ పర్యటన ఉన్న కారణంగా రాలేనని కెటిఆర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఇప్పుడు విచారణకు హాజరుకావాలని కెటిఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చింది.

అయితే ఈ నోటీసులపై కెటిఆర్‌ (KTR) స్పందించారు. ఫార్ములా-ఈ రేసు కేసులో విచారణకు జూన్ 16న హాజరు అవుతానని ఆయన పేర్కొన్నారు. బాధ్యత గల పౌరుడిలా తాను విచారణకు సహకరిస్తానని ఆయన తెలిపారు. పాలన చేతకాక.. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం ఇది అని అన్నారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో సిఎం రేవంత్‌ను కూడా ఎసిబి (ACB) విచారిస్తుందని.. లై డిటెక్టర్ పరీక్షలకు తాను సిద్ధమని.. సిఎం సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. జడ్జి సమక్షంలో ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందామని సవాల్ విసిరారు. టివిల్లో ఈ పరీక్షలు లైవ్‌గా ప్రసారం చేస్తే.. ఎవరు నేరస్థులో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. తనతో పాటు లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకునే దమ్ము ఉంటే ముందుకు రావాలని డిమాండ్ చేశారు. విచారణ పేరుతో ఇలా పదే పదే ప్రజాధనం వృథా చేయడం ఎందుకు అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News