ఫార్ములా ఈ- కార్ రేసు కేసులో ఎసిబి అధికారులు దూకుడు పెంచారు. బుధవారం(జూన్ 18)లోగా సెల్ఫోన్, ల్యాప్టాప్ అప్పగించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కెటిఆర్ ఆదేశాలు జారీ చేశారు. కెటిఆర్ ఉపయోగించిన సెల్ ఫోన్, మ్యాక్ బుక్, ట్యాబ్లో కీలక సమాచారం ఉందని ఎసిబి భావిస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచే కెటిఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉంటారని ఎసిబి యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్టేట్మెంట్ ఆధారంగా ఎసిబి అధికారులు డాక్యుమెంట్లను రెడీ సిద్ధం చేస్తున్నారు.
కాగా, ఎసిబి ఆదేశాలపై కెటిఆర్ న్యాయవాదులతో చర్చించి, న్యాయసలహా ప్రకారం నడుచుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కేసులో సోమవారం నాడు కెటిఆర్ ఎసిబి విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన ఎ1గా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు కెటిఆర్పై ఆరోపణలు ఉన్నాయి. సుమారు 8 గంటల పాటు విచారణ చేసిన ఎసిబి.. అవసరం అయితే, మరోసారి పిలుస్తామని తెలిపింది.