Tuesday, June 17, 2025

రేపటిలోగా సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ అప్పగించాలి.. కెటిఆర్‌కు ఎసిబి ఆర్డర్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో ఎసిబి దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కెటిఆర్ సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ లను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. నిన్న ఫార్ములా ఈ కేసులో ఎసిబి విచారణకు కెటిఆర్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎసిబి అధికారులు వేసిన పలు ప్రశ్నలకు కెటిఆర్ సమాధానాలు ఇచ్చారు. అనంతరం ఆయన వాగ్మూలాన్ని రికార్డు చేశారు. ఈ విచారణ అనంతరం కెటిఆర్ వాడిన సెల్‌ఫోన్‌, మ్యాక్‌బుక్‌, ట్యాబ్‌లో కీలక సమాచారం ఉందని ఎసిబి అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రానిక్‌ పరికరాల నుంచే కెటిఆర్‌, అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కెటిఆర్ సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ లను పరిశీలించేందుకు ఎసిబి నిర్ణయించింది. కెటిఆర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా డాక్యుమెంట్లను రెడీ చేస్తున్న ఎసిబి అధికారులు.. రేపటిలోగా సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ అప్పగించాలని కెటిఆర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో న్యాయ సలహా ప్రకారం నడుచుకుంటానని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News