ఫార్ములా ఈకార్ రేసింగ్
సమయంలో ఉపయోగించిన
సెల్ఫోన్లను 18లోపు అప్పగించాలని
కెటిఆర్కు ఎసిబి ఆదేశం ఈకార్
రేసింగ్లో ఎనిమిది గంటల పాటు
సాగిన విచారణ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఫార్ములా ఈ-రేసు నిర్వహణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో బిఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సోమవారం ఎసిబి అ ధికారు ల ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటల పాటు అధికారులు ఆయనను విచారించారు. ఈ సందర్భంగా కెటిఆర్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే, తాను సెల్ఫోన్ తీసుకురాలేదని కెటిఆర్ అధికారులకు వెల్లడించారు. దీంతో, ఫార్ములా ఈ-రేసు నిర్వహణ సమయంలో ఉపయోగించిన సెల్ఫోన్లను ఈ నెల 18వ తేదీలోగా తమకు అప్పగించాలని ఎసిబి అధికారులు కెటిఆర్ను ఆదేశించారు.
కెటిఆర్పై ఎసిబి ప్రశ్నల వర్షం
ఫార్ములా -ఈ కార్ రేసు కేసులో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎసిబి విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఎసిబి ప్రధాన కార్యాలయానికి చేరుకోగా అడ్వకేట్ రామచందర్రావుతో కలిసి లోపలికి అనుమతి ఇచ్చారు. ఈ కేసులో ఎ1గా ఉన్న కెటిఆర్ను ఎసిబి జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డిఎస్పి శర్మ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మాజీద్ ఖాన్తో కూడిన ఐదుగురు సభ్యుల బృందం ప్రశ్నించినట్లు సమాచారం. నిధుల దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదు బదిలీకి సంబంధించి ఆయనపై ఎసిబి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఎఫ్ఇఒ కంపెనీకి చెందిన ప్రతినిధులతోపాటు ఈ కేసులో మరికొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా విచారించినట్లు సమాచారం. ఎసిబి అధికారులు కెటిఆర్ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు కెటిఆర్కు సూచించారు.
తెలంగాణ భవన్కు తాళం
కెటిఆర్ విచారణ నేపథ్యంలో ఎసిబి కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు, బిఆర్ఎస్ శ్రేణులు ఎసిబి కార్యాలయం వైపు రాకుండా భారీగా పోలీసులు మోహరించారు. అలాగే తెలంగాణ భవన్ గేటుకు పోలీసులు తాళం వేశారు. మరోవైపు సోమవారం సిఎం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు రానున్న నేపథ్యంలో అటువైపు బిఆర్ఎస్ శ్రేణులు దూసుకురాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించడమే కాకుండా కమాండ్ కంట్రోల్ సెంటర్కు సమీపంలో ఉన్న నీలోఫర్ కేఫ్ను మూసి వేయించారు.
న్యాయవాదులతో హరీష్రావు చర్చలు
కెటిఆర్ ఎసిబి విచారణకు హాజరైన నేపథ్యంలో తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు న్యాయవాదులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఎసిబి విచారణకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించినట్లు తెలిసింది.