Wednesday, September 17, 2025

విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం: 9మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారంలో శనివారం ప్రమాదం సంభవించింది. ఎస్ఎంఎస్-2లో ద్రవ ఉక్కు తీసుకెళ్తున్న లాడెన్ పగిలింది. ద్రవ ఉక్కు మీదపడి తొమ్మిది మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఆరుగురు ఒప్పంద కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను తక్షణమే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News