- Advertisement -
తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది… వివరాలలోకి వెళితే.. తిరుమల నుండి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళ కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డులోని 24వ మలుపు వద్ద ఘటన జరిగింది. భర్త, కొడుకు తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఢీకొన్న బస్సు ప్రమాదంలో అరీఫా (32) మృతి, భర్త సురేష్, కొడుకు షామీర్ సురక్షితం బయటపడ్డారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
- Advertisement -