- Advertisement -
సంగారెడ్డి జిల్లా రుక్మాపూర్ మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బోయిని ప్రశాంత్ అనే యువకుడు.. ఆన్లైన్ బెట్టింగ్ ఆడేందుకు డబ్బుల కోసం రాణెమ్మ(48)ను హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తు తేల్చారు. రుక్మాపూర్లో మే 26న అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి చొరబడిన ప్రశాంత్.. ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత మహిళ ఒంటిపై ఉన్న బంగారం, ఇంట్లో నగదుతో ప్రశాంత్ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. ప్రశాంత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
- Advertisement -