భారత్లో కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతోంది. గత పది రోజులుగా దేశంలో కొవిడ్ బారిన పడుతున్న వారిసంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 3000 దాటిపోయింది.అత్యధికంగా కేరళలో 1,336 కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాతి స్థానాల్లో ఉన్నాయని తెలిపింది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా685 కొవిడ్ కేసులు నమోదయ్యాయని, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు ఇప్పటివరకు చనిపోయారని మంత్రిత్వశాఖ తెలిపింది.దేశంలో కొవిడ్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి. వ్యాధి సోకిన వారిలో ఇన్ఫెక్షన్ తీవ్రత తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. చాలా మంది రోగులు ఇంటివద్దనే చికిత్స తీసుకుంటున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ‘
కాగా ఈ నెల 22న దేశంలో 257 కేసులు మాత్రమే ఉండగా 26 నాటికి ఆ సంఖ్య 1,010కి, శనివారం నాటికి 3,395కు పెరిగిపోయాయి. కేరళలో అత్యధికంగా 1,336 యాక్టివ్ కేసులు ఉండగా,మహారాష్ట్రలో 467,ఢిల్లీలో 375, గుజరాత్లో 265, కర్ణాటకలో 234, పశ్చిమ బెంగాల్లో 205, తమిళనాడులో 185, ఉత్తరప్రదేశ్లో 117 కేసులు ఉన్నట్లు వెల్లడించింది. పశ్చిమదక్షిణ ప్రాంతాల్లోని నమూనాల్లో జనుశ్రేణిని పరిశీలిం చినప్పుడు, ప్రస్తుత కేసుల పెరుగుదలకు కారణమైన వైవిధ్యాలు అంత తీవ్రమైనవేమీ కాదని, ఒమిక్రాన్ సబ్ వేరియంట్స్ అని తేలిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్( ఐసిఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బెహ్ల్ చెప్పారు. ఒమిక్రాన్ నాలుగు సబ్ వేరియంట్లు ఎల్ఎఫ్.7,ఎక్స్ఎఫ్జి,జెఎన్.1, ఎన్బి1.8.1లను గుర్తించామని, వీటిలో మొదటి మూడు వేరియంట్లకు చెందిన కేసులే ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, ఈ సమయంలోఅన్నిటినీ పర్యవేక్షించాలని, అప్రమత్తంగా ండాలని అన్నారు.అయితే ఆందోళన చెందడానికి ఎలాంటి కారణం లేదని బెహ్ల్ చెప్పారు.