Tuesday, June 17, 2025

రాష్ట్ర ప్రజలు కెటిఆర్ తీరును గమనిస్తున్నారు:అద్దంకి దయాకర్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రజలు కెటిఆర్ తీరును గమనిస్తున్నారని, సిగ్గుపోయేదాక సిగం ఊగినట్టు కెటిఆర్ పరిస్థితి ఉందని, తెలంగాణ ప్రజలు ఓడిస్తే కెసిఆర్ ఫాంహౌస్‌లో పడుకున్నారని ఎమ్మెల్సీ, అద్దంకి దయాకర్ ఆరోపించారు. కెటిఆర్ మాయల మరాఠి అని, ఆయన మాటలు చూస్తుంటే ఆయన భయం ఏమిటో అర్థం అవుతుందన్నారు. కెటిఆర్‌కు ఇంగిత ఙ్ఞానం లేదని, భయంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆయన తెలిపారు. కెటిఆర్ ఇప్పుడే నీ ఆట మొదలైందని, నువ్వు హీరో మాదిరిగా ఫోజులు కొడుతున్నావని ఆయన ఆరోపించారు. మా ముఖ్యమంత్రిపై గురించి నీవు మాట్లాడే భాషను చూసి తెలంగాణ సమాజం ముక్కున వేలు వేసుకుంటుందన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కెటిఆర్ ఓ అపశృతి అని, తెలంగాణ ఉద్యమంలో కెటిఆర్ ఎక్కడ జైలుకు వెళ్లాడో తెలియదు కానీ, ఆయన చేసే పిచ్చి ప్రేలాపనలు చూస్తే మాత్రం తగిన బుద్ధి చెప్పాలనిపిస్తుందని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News