Sunday, June 15, 2025

సౌతాఫ్రికా అపూర్వ విజయం.. చరిత్ర సృష్టించిన మార్క్‌రమ్

- Advertisement -
- Advertisement -

లండన్: 27 సంవత్సరాల సుదీర్ఘ ఎదురుచూపు తర్వాత సౌతాఫ్రికా జట్టు ఐసిసి ట్రోఫీని ముద్ధాడింది. లార్డ్స్ వేదికగా జరిగిన డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో సౌతాఫ్రికా ఆటగాడు ఎయిడెన్ మార్క్‌రమ్ (Aiden Markram) కీలక పాత్ర పోషించాడు. 282 పరుగుల లక్ష్య చేధనలో అతను వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. 207 బంతుల్లో 136 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతను సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసిసి ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి సౌతాఫ్రికా ఆటగాడిగా మార్క్‌రమ్ (Aiden Markram) రికార్డుల్లోకెక్కాడు. మార్క్‌రమ్ ఔట్ అయి పెవిలియన్‌కి వెళ్తున్న క్రమంలో అతన్ని ప్రత్యర్థి ఆటగాళ్లు అభినందించడంతో పాటు.. లార్డ్స్ మైదానంలోని ప్రేక్షకులు అందరు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.

కాగా, డబ్ల్యూటిసి ఫైనల్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాలో తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగుల చేసి ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసింది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ మార్క్‌రమ్ 136, కెప్టెన్ బావుమా 66 పరుగులతో రాణించడంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా నిలిచింది. కాగా, ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్ అవార్డు కూడా మార్క్‌రమ్‌కే దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News