రక్షణ ఒప్పందాలపై వాయుసేన
అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్
అమర్ప్రీత్సింగ్ అసంతృప్తి
రక్షణ మంత్రి సమక్షంలోనే
వ్యాఖ్యలు సకాలంలో
పూర్తయిన ప్రాజెక్టు ఒక్కటీ
లేదని తీవ్ర విమర్శ
తేజస్ ఎంకె2 ఇంకా
అందలేదని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: రక్షణ రంగం లోని ప్రధాన కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయి కానీ, డెలివరీలు మాత్రం మొదలు కావని వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఐఐ వార్షిక సమావేశం లో ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్స మక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. “ చాలా సా ర్లు కాంట్రాక్టులపై సంతకాలు జరుగుతాయి. కానీ సిస్టమ్స్ (ఆయుధాలు) మాత్రం ఎప్పటికీ అందవు. టైమ్లైన్ ప్రధాన సమస్య. సకాలం లో పూర్తయిన ఒక్క ప్రాజెక్టు కూడా నాకు గు ర్తుకు రావడం లేదు. మనం చేయలేని పనికి ఎందుకు వాగ్దానాలు చేయడం? తేజస్ ఎంకే 1 చాలా ఆలస్యమైంది. ఇక తేజస్ ఎంకే 2 ఫోటోటైప్ కూడా అందుబాటు లోకి రాలేదు. ఇక ఆమ్కా ఫైటర్కు సంబంధించి ఇప్పటివర కు నమూనా విమానం కూడా రాలేదు. మన దళాలు, పరిశ్రమ మధ్య విశ్వాసం పెరగాల్సిన అవసరం ఉంది. పారదర్శకత చాలా అవస రం.మనం ఒక్కసారి దేనికైనా కట్టుబడితే దాని ని అందించి తీరాల్సిందే. మేకిన్ ఇండియా కో సం వాయుసేన శక్తివంచన లేకుండా కృషి చే స్తోంది. మనం ఈరోజు సంసిద్ధంగా ఉంటేనే, భవిష్యత్తుకు సన్నద్ధం కాగలం. రానున్న పదేళ్లలో మన పరిశ్రమలు ఉత్పత్తిని గణనీయంగా పెంచగలవు. కానీ ప్రస్తుతానికి మనం త్వరగా చర్యలు తీసుకోవడం అవసరం. దళాలను శక్తిమంతం చేసుకుంటేనే యుద్ధాలు గెలుస్తాం” అని పేర్కొన్నారు.
యుద్ధం రంగం వేగంగా మారిపోతోంది..!
యుద్ధ రంగంలో వేగంగా మారిపోతున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవాలని ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ సూచించారు. “ మన నౌకాదళాధిపతి చెప్పినట్టు యుద్ధరంగం వేగంగా మారిపోతోంది. ప్రతిరోజూ సరికొత్త టెక్నాలజీలు అందుబాటు లోకి వస్తున్నట్టు చూస్తున్నాం. ఆపరేషన్ సిందూర్తో మనం ఎక్కడ ఉన్నాం. భవిష్యత్తుకు ఏం కావాలనే దానిపై స్పష్టమైన అవగాహన వచ్చింది.మనం చేయాల్సింది చాలా ఉంది. ఆమ్కా ప్రాజెక్టును ప్రైవేట్ సెక్టార్ కోసం కూడా క్లియర్ చేశారు. ఇది చాలా పెద్ద నిర్ణయం. మన ప్రైవేట్ రంగంపై దేశానికి ఆ స్థాయిలో విశ్వాసం ఉంది. భవిష్యత్తులో భారీ మార్పులకు ఇది బాటలు పరుస్తుంది ” అని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో కూడా వాయుసేనాధిపతి తేజస్ డెలివరీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “తయారీ సంస్థలు ఉత్పత్తి వేగం పెంచడానికి అత్యాధునిక వ్యవస్థలపై పెట్టుబడులు పెట్టాలి. వారి మానవ వనరుల నైపుణ్యాలకు మెరుగులు దిద్దాలి. తేజస్ తొలి ఎయిర్ క్రాఫ్ట్ 2001 లోనే గాల్లోకి ఎగిరింది. 2016 నుంచి ఇప్పటివరకు తొలి 40 విమానాలు డెలివరీ కూడా పూర్తి కాలేదు ” అని నాడు ఆయన వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది.