Saturday, June 14, 2025

మృత్యుంజయుడు ఒకే ఒక్కడు

- Advertisement -
- Advertisement -

విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఒక
ప్రయాణికుడు ప్రమాదం అనంతరం
నడిచివచ్చిన 38 ఏళ్ల రమేశ్ విశ్వకుమార్
11ఎ సీటులో కూర్చున్న రమేష్

అహ్మదాబాద్ : విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్కడు మృత్యుంజయుడుగా బయటపడ్డాడు. ‘విమానం అయింది. ఇంకా సర్దుకోక ముందే కేవలం 30 సెకన్లలోనే పెద్ద శబ్ధం. అంతే విమానం కూలిపోయింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది’ అని ప్రమాదం నుంచి బయటపడిన విశ్వాస్ తెలిపారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు ఛాతీమీద, కళ్ళు, పాదాలపై తీ వ్రంగా గాయలయ్యాయి.ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం నుంచి బతికి గాయాలతో ఆస్పత్రిలో చేరిన వారిలో తమవారి కోసం చాలా మంది బంధువులు అహ్మదాబాద్ లోని అసర్వ సివిల్ హాస్పిటల్ కు చేరి గాలిస్తుండగా, జనరల్ వార్డు మంచంపై 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేశ్ పడి ఉన్నారు. ఘోరమైన ప్రమాదం నుంచి తాను బయటపడ్డానని ఆయన చెప్పారు.

గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు గాట్విక్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ సిబ్బందితో సహా 242 మంది ప్రయాణికులతో బయలుదేరిన నిముషంలోనే కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. విశ్వాస్ బ్రిటీష్ జాతీయుడు. కొన్నాళ్ల క్రితం భారతదేశంలోని తమ కుటుంబాన్ని చూసేందుకు వచ్చాడు. తిరిగి బ్రిటన్ కు వెళ్లేందుకు తన అన్న 45ఏళ్ల అజయ్ కుమార్ రమేశ్ పాటు విమానం ఎక్కారు. విశ్వాస్ బోర్డింగ్ పాస్ కూడా ఇంకా అతడి వద్దే ఉంది.విమానం పేలిపోయిన వెంటనే నేను కళ్లు తెరిచి చూస్తే.. చుట్టుపక్కల అంతా శవాలే. భయపడిపోయాను  ఒక్కసారి కింద పడిపోయిన నేను లేచి పరుగుపెట్టాను. పేలిపోయినవిమానం ముక్కలను దాటుతూ పరుగు పెట్టాను. అంతలో ఎవరో నన్ను ఒక్క గుంజు గుంజారు. అంబులెన్స్ లో పడేశారు. ఆస్పత్రికి చేర్చారు అని ఆ క్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాస్ తెలిపారు.

తాను 20ఏళ్లుగా లండన్ లో నివశిస్తున్నానని, తన భార్య బిడ్డ లండన్ లోనే ఉంటున్నారని విశ్వాస్ తెలిపారు. తన అన్న అజయ్ కుమార్ విమానంలో వేరే వరుసలో కూర్చున్నాడని చెబుతూ.. ఆయన తనతో లండన్ కు బయలు దేరారని, కానీ ఇప్పుడు తనకు ఇక్కడ ఆస్పత్రిలో కనబడలేదని, దయచేసి ఎవరైనా ఆయన ఎలా ఉన్నాడో కనుగొనడానికి సాయం చేయాలని విశ్వాస్ కోరుతున్నాడు. ఆస్పత్రిలో ఇతర వార్డులలోనూ, ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికుల కు చెందిన కుటుంబసభ్యులు స్నేహితులు తమ బంధువులకోసం వెదుకుతున్నారు. వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. విజయ్ రూపానీ లండన్ లో ఉన్న తన భార్యను తిరిగి తీసుకువచ్చేందుకు వెళ్తూ ఆ విమానంలో ఉన్నారు. గతంలో రూపానీ కి సహాయకుడిగా పనిచేసిన శైలేష్ మాండ్లియా కూడా ఆయన కోసం ఆస్పత్రిలో వెదుకుతున్నారు. విజయ్ రూపానీ కన్పిస్తే తెలియజేయాలని ఆయన వేడుకొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News