న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎయిర్ ఇండియా పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి పట్ల ప్రగాఢ సంతాపం, వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున మధ్యంతర పరిహారాన్ని ప్రకటించింది. అలాగే, ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపింది. టాటా సన్స్ ఇప్పటికే రూ.1 కోటి ఆర్థిక సహాయాన్ని అందించింది. కాగా, గురువారం అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు తప్ప మిగతా వారందరూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓ మెడికల్ కాలేజీ భవనంపై విమానం కూలడంతో అందులో ఉన్నవారు కూడా కొందరు మృతి చెందారు. ఈ విమాన ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 270కి చేరుకుంది. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
మృతులకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ఎయిర్ ఇండియా
- Advertisement -
- Advertisement -
- Advertisement -