గురువారం అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య 270కి పెరిగింది. మెడికల్ విద్యార్థుల హాస్టల్ పై విమానం కుప్పకూలడంతో గాయపడిన వారిలో చికిత్స పొందుతూ కొందరు మరణించారని వైద్యులు తెలిపారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి గురువారం లండన్ లోని గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన
ఎయిర్ ఇండియా ఏఐ171 బిజే మెడికల్ హాస్టల్, క్యాంటీన్ కాంప్లెక్స్ పై కుప్పకూలింది. మొదట్లో మృతుల సంఖ్య 265 గా అంచనా వేశారు.గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది నిమిషాలకే లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న విమానం AI 171, BJ మెడికల్ హాస్టల్ మరియు దాని క్యాంటీన్ కాంప్లెక్స్ను కూల్చివేసింది. అధికారులు ముందుగా మృతుల సంఖ్య 265 గా అంచనా వేశారు. ప్రమాదం పాలైన విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు.
230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు. పది మంది సిబ్బంది.వారిలో 241 మంది మరణించారు. భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడు విశ్వాస్ మాత్రం ప్రాణాలతో బయట పడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకొంటున్నాడు.విమాన ప్రమాదస్థలం నుంచి ఇప్పటి వరకూ దాదాపు 270 మృతదేహాలను సివిల్ ఆస్పత్రికి తీసుకు వచ్చారని బిజె మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ధవల్ గమేటి తెలిపారు. అహ్మదాబాద్ అగ్నిమాపక, అత్యవసర సేవా బృందం గత 24 గంటల్లో మెడికల్ హాస్టల్ ఉన్న మేఘని నగర్ ప్రాంతంలో విమానస్థలంలో పలువురి శరీర భాగాలను, ఒక మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకుంది. మరణించిన వారిని గుర్తించేందుకు నిర్విరామంగా డిఎన్ఏ టెస్ట్ లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తారు.ఎయిర్ ఇండియా విమానం తోకభాగం దెబ్బతిన్న క్యాంటీన్ భవనంపైన ఇరుక్కుపోయింది.
దానిని కిందకు దించేందుకు క్రేన్ లను ఉపయోగిస్తున్నట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ జయేష్ ఖాడియా తెలిపారు.2011లో అరంగేట్రం తర్వాత ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ కుప్పకూలడం ఇదే ప్రథమం. విమాన ప్రమాదాలపై దర్యాప్తు చేస్తే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబి) ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత విమానం బ్లాక్ బాక్స్ ను స్వాదీనం చేసుకుందని కేంద్ర పౌరవిమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.