Thursday, June 19, 2025

బద్దలైన అగ్నిపర్వతం.. వెనక్కి మళ్లిన ఎయిరిండియా విమానం

- Advertisement -
- Advertisement -

తూర్పు ఇండోనేసియా లోని లెవోటోబి లకిలకి అగ్నిపర్వతం బద్దలవ్వడంతో దానికి సమీపంలో బాలికి వెళ్లే ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లింది. అక్కడి నుంచి తిరుగుపయనమైన విమానం బుధవారం ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్టు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తూర్పు ఇండోనేషియా లోని నుసా టెంగారా ప్రావిన్స్ లోని విమానాశ్రయాన్ని మూసివేసినట్టు వెల్లడించారు.

తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్ లోని లెవోటోబి లకిలకి పర్వతం మంగళవారం విస్ఫోటనం చెందడంతో దాదాపు 11 కిమీ ఎత్తులో బూడిద ఎగసిపడినట్టు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉదయం అగ్నిపర్వతంలో మళ్లీ విస్ఫోటనం సంభవించడంతో 1 కిమీ ఎత్తులో దట్టమైన బూడిద ఎగసిపడుతున్నట్టు తెలిపారు. ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధికారి అవీ హల్లన్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చివరిసారిగా ఈ ఏడాది మేలో లకిలకి పర్వతం పలుమార్లు బద్దలయ్యిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News