ఆహ్మాదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బందితో కలిసి మొత్తం 265 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రమాదాన్ని ముందు గ్రహించిన ఓ ప్రయాణికుడు విమానం నుంచి దిగిపోయాడు. గురువారం ఢిల్లీ నుంచి లండన్ వయా అహ్మదాబాద్ మీదుగా ఎయిరిండియా విమానం బయల్దేరింది. అయితే, విమానంలో లోపం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసిన ఆకాష్ వత్స అనే ప్రయాణికుడు.. ఢిల్లీలో బయల్దేరి అహ్మదాబాద్లో దిగిపోయాడు. ఈ విషయాన్ని ఎక్స్లో తెలియజేస్తూ.. ప్రమాదానికి 2 గంటల ముందు తాను అదే విమానంలో ఉన్నానని.. అందులో లోపం ఉందని గ్రహించిన అహ్మదాబాద్ లో దిగిపోయానని, తర్వాత ఎయిర్ ఇండియాకు కూడా సమాచారం ఇచ్చానని ఆకాష్ పోస్ట్ చేశాడు. కాగా, అహ్మాదాబాద్ లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు లండన్కు బయలుదేరిన వెంటనే ఎయిరిండియా బోయింగ్ 787 విమానం డ్రీమ్ లైనర్ నగరంలోని నివాసిత ప్రాంతంలో కున్పకూలింది. ఈ ఘటనలో ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయట పడగా.. మిగతా అందరూ మరణించారు.
విమానంలో లోపం ఉందని ముందే గుర్తించి దిగిపోయిన ప్రయాణికుడు..
- Advertisement -
- Advertisement -
- Advertisement -