మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టుకు అక్కినేని నాగార్జున, నాగచైతన్యలు బుధవారం హాజరయ్యారు. సమంత, నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు నాగార్జున, నాగ చైతన్య కోర్టుకు వెళ్లారు. కెటిఆర్పై విమర్శలు చేసిన సందర్భంలో మంత్రి కొండా సురేఖ నాగచైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన సినీ నటుడు అక్కినేని నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన కామెంట్ల వీడియో క్లిప్పింగ్స్, సోషల్ మీడియా లింక్స్ నాంపల్లిలోని స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు పర్చారు. తమ కుటుంబ పరువు, ప్రతిష్టకు భంగం కలిగించేలా సురేఖ వ్యాఖ్యలు చేశారని, చట్టపరమైన క్రిమినల్ చర్యలతో పాటు పరువు నష్టానికి సంబంధించి బిఎన్ఎస్ 356 కింద చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. “నా కుమారుడు అక్కినేని నాగచైతన్య, సమంతకు 2017లో వివాహం జరిగింది. ఇద్దరి మధ్య తలెత్తిన వ్యక్తిగత వ్యత్యాసాలతో మ్యూచువల్గా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య, సమంత ఎవరికి వారు తమ ప్రొఫెషన్స్ కొనసాగిస్తున్నారు. అయితే మా కుటుంబ పరువుకు భంగం వాటిల్లే విధంగా మంత్రి కొండా సురేఖ నిరాధారణమైన వ్యాఖ్యలు చేశారు అని నాగార్జున పేర్కొన్నారు.
నాంపల్లి కోర్టుకు హాజరైన అక్కినేని నాగార్జున, నాగచైతన్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -