Wednesday, April 30, 2025

‘మా పవన్.. మా పవన్’ అంటూ కాపులు గోక్కుంటున్నారు..

- Advertisement -
- Advertisement -

కాపులపై ఎపి నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులంతా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబుకు ఊడిగం చేయండని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జరిగిన ఓ సభలో మంత్రి రాంబాబు మాట్లాడుతూ.. ”కాపులు ‘మా పవన్.. మా పవన్’ అంటూ గోక్కుంటున్నారు. కాపులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఉంటారో, చంద్రబాబుకు ఊడిగం చేసే పవన్ కళ్యాణ్ తో ఉంటారో తేల్చుకోండి. నేను విమర్శించినంత ఘాటుగా వైసిపిలో ఎవరూ విమర్శించరు. అందుకే నాపై ఆరోపణలు చేస్తున్నారు” అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News