Monday, June 30, 2025

పదేళ్ల అవినీతిపై చర్యలేవి?

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వ పెద్దలపై రేవంత్
సర్కార్ వెనకడుగు తెలంగాణలో
రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కారే
వచ్చే ఏడాది మార్చిలోగా
మావోయిస్టులను ఏరిపారేస్తాం
చేతుల్లో ఆయుధాలు
ఉన్నవాళ్లతో చర్చలు ఎలా
జరుపుతాం? కా్రంగెస్
హైకమాండ్‌కు తెలంగాణ
ఎటిఎంలా మారింది పసుపు
రైతుల 40 ఏళ్ల కలను ప్రధాని
మోడీ సాకారం చేశారు మూడు,
నాలుగేళ్లలో నిజామాబాద్ పసుపు
ప్రపంచవ్యాప్తం కాబోతోంది
కిసాన్ సమ్మేళనం సభలో కేంద్ర
హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు
జాతీయ పసుపు బోర్డు
కార్యాలయానికి ప్రారంభోత్సవం
కంఠేశ్వర్ కూడలిలో డిఎస్
విగ్రహావిష్కరణ

మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: రాబో యే రోజుల్లో పసుపునకు ఇందూరు కేంద్రంగా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పా టు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని ఆదివా రం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ప సుపు బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప సుపు ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏ ర్పాటు చేసిన జరిగే రైతు సభలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పసుపు రైతు ల 40 ఏళ్ల కలను ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ మాట నెలబెట్టుకున్నారని గుర్తు చేశారు. మోడీ మాట ఇచ్చారంటే నిలబెట్టుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పసుపు బోర్డు కోసం బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్‌తో ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.

ఇందూరు కేంద్రంగా పసుపు బోర్డు మంజూరు చేయడమే కాకుండా నిజామాబాద్‌కు చెందిన బిడ్డ అయిన పల్లె గంగారెడ్డికి ఛైర్మన్ పదవి అప్పగించామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం బోర్డు ఏర్పా టు చేశామన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మూడు నాలుగేళ్లలోనే నిజామాబాద్ ప సుపు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుందని చెప్పారు. ప్రపంచంలో పసుపునకు డిమాండ్ ఉన్న దృష్టా అందులో ఉండే ఔషధ గుణాలపై ప్రచారం నిర్వహిస్తోందని పేర్కొన్నారు. తెలంగా ణ రాష్ట్రం ఇక్కడి పాలకులకు ఎటిఎంగా మారిందని, రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన కెసిఆర్ ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందా? లేదా అంటూ ఆయన ప్రజలను ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా గత ప్రభుత్వంలోని పెద్దలపై ఎలాంటి కేసులు లేవన్నారు. అన్ని వర్గాల సహకారంతో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని అన్నారు. ఇక్కడ కూడా బిజెపి సర్కార్ రాబోతోందని అన్నారు. ఆదివాసీలు ఉండే అటవీ ప్రాంతాలను అల్లకల్లోం చేస్తున్న మావోయిస్టులను వచ్చే ఏడాది మార్చిలోగా అంతం చేస్తామని స్పష్టం చేశారు.

అనేకమంది అమాయకులను హతం చేసిన నక్సలైట్ల విషయంలో ఎలాంటి సానుకూలత ఉండబోదన్నారు. అలాంటి వ్యక్తులతో చర్చలు జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నక్సల్స్‌కు మద్దతుగా మాట్లాడేవారు వారి బాధితుల కుటుంబాల పరిస్థితి ఎలా ఉందో ముందు తెలుసుకోవాలని హితవు పలికారు. అయినా ఆయుధాలు చేతిలో ఉన్న వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. మావోయిస్టులకు లొంగిపోవడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని గుర్తు చేశారు. కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు నుంచి నక్సల్ ముక్త్ భారత్ వరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్నో విజయాలు సాధించిందన్నారు. తాజాగా ఉగ్రవాదులను అంతం చేయడంలో సైతం భారత్ చూపిన తెగువను ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయని అన్నారు. ఉగ్రవాదులను అంతం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ఎనలేనిదని స్పష్టం చేశారు. అనంతరం కంఠేశ్వర్ కూడలిలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి డి. శ్రీనివాస్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు.

పసుపు రైతుల దశాబ్దాల కలను నెరవేర్చిన మోడీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
పసుపు రైతుల దశాబ్దాల కలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో పసుపు సాగవుతున్నా ఈ ప్రాంతంపై ప్రేమతో ప్రధాని మోడీ, అమిత్ షా నిజామాబాద్‌లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేశారని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. ఈ ప్రాంత రైతులకు కేంద్రం అండగా ఉందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ..

పసుపు రైతుల అనేక పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు వచ్చిందని అన్నారు. మోడీ ప్రభుత్వం రైతుల ఆకాంక్షలను గుర్తించి బోర్డును మంజూరు చేయడం సంతోషకరమని అన్నారు. నిజామాబాద్‌లో బోర్డు ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయమని అన్నారు. ఇందుకోసం ఎంపి అర్వింద్ ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ రైతులను రాజులుగా చేయడానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపిలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎంఎల్‌ఎ ధన్‌పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News