కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29 ఆదివారం రాష్ట్రానికి రానున్నారు. ఆదివారం ఉదయం 11.25 గంటలకు గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట విమానశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.45 గంటలకు బేగంపేట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడి నుంచి వినాయక్ నగర్లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్నీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభిస్తారని పార్టీ వర్గాల సమాచారం.
మధ్యాహ్నాం రెండు నుంచి రెండున్నర వరకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలోనే అమిత్షా ఉంటారు. మధ్యాహ్నం 2.35 గంటలకు నిజామాబాద్లో ఏర్పాటు చేసిన డి.శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నాం 2. 45 నుంచి 4 గంటల వరకు పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే కిసాన్ మహా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారని ఆయా వర్గాలు పేర్కొన్నాయి.