- Advertisement -
అమరావతి: రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిన వైసిపి అధినేత మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి కు ప్రజలు బుద్ధి చెప్పారని ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిపై వైసిపి నేతల దొంగ నాటకాలు మళ్లీ మొదలయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా అనగాని మీడియాతో మాట్లాడుతూ.. గుంటూరు- విజయవాడ మధ్య రాజధాని నిర్మిస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధానిపై జగన్ వైఖరిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
Also Read : చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ నిర్మించలేదు: రోజా
- Advertisement -