Monday, July 7, 2025

ప్రభుత్వ బడులను దత్తత తీసుకోవాలి: ఆనం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపి విఆర్ హైస్కూల్ లో మున్సిపల్ కార్పొరేషన్ పదం తీసేయాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) తెలిపారు. విఆర్ హైస్కూల్ పేరు మార్చడంపై మంత్రి ఆనం అభ్యంతరం తెలిపారు. నెల్లూరు విఆర్ స్కూల్ ప్రారంభ కార్యక్రమంలో ఆనం వివాద వ్యాఖ్యలు చేశారు. విఆర్ విద్యాసంస్థలు తమ కుటుంబం పర్యవేక్షణలో ఉన్నాయని అన్నారు. వైసిపి ప్రభుత్వం కక్షతో మేనేజింగ్ కమిటీ అధ్యక్ష పదవి (Chairmanship Committee) నుంచి నన్ను తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థగా మారిస్తే ఇబ్బందులు వస్తాయని చెప్పారు. ప్రభుత్వ బడులను దత్తత తీసుకోవాలని అధికారులను కోరారు. విద్యాసంస్థల ద్వారా ఎదిగాకే మంత్రి నారాయణ రాజకీయాల్లోకి వచ్చారని తెలియజేశారు. తమ కుటుంబం మొదటి నుంచీ రాజకీయాల్లోనే ఉంది ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News