Thursday, July 31, 2025

భర్తను స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

అమరావతి: దంపతుల మధ్య గొడవ జరగడంతో కణికావేశంలో భర్తను భార్య హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా బంటుమిల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. చిన్నతమ్ముడి గ్రామంలో అప్పారావు(30), కీర్తన(27) అనే దంపతులు నివసిస్తున్నారు. అప్పారావు మద్యానికి బానిసగా మారడంతో ప్రతి రోజు భార్యతో గొడవ పడేవాడు. మంగళవారం రాత్రి మద్యం తాగొచ్చి ఇంట్లో భార్యతో ఘర్షణకు దిగాడు. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భార్య స్క్రూ డ్రైవర్ తీసుకొని భర్త మెడలో పొడిచింది. దీంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఇద్దరికి తొమ్మిది సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News