Sunday, June 29, 2025

జూరాలకు సమాంతరంగా మరో బ్రిడ్జి

- Advertisement -
- Advertisement -

నూతన వంతెన నిర్మాణానికి
రూ.100కోట్లు ప్రాజెక్టుకు
ముప్పు లేదు ప్రజల్లో
గందరగోళం సృష్టిస్తున్న ప్రతిపక్షాలు
పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలో
భ్రష్టుపట్టిన ఇరిగేషన్ శాఖ
ర్యాలంపాడు నిల్వ సామర్థం
పెంపు : మంత్రి ఉత్తమ్‌కుమార్

మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు సమాంతరంగా రూ 100 కోట్లతో మరో బ్రిడ్జి నిర్మాణాన్ని చేపడతామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రె డ్డి వెల్లడించారు. ధరూర్ మండల పరిధిలోని నెట్టెంపాడు లిఫ్ట్‌లో భాగంగా నిర్మించిన ర్యాలంపాడు రి జర్వాయర్, జూరాల ప్రాజెక్ట్‌ను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా జూరాల డ్యాం గే ట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. జూరాల గ్యాంటీ క్రేన్ కోసం రూ.3.50 కోట్లు మంజూరు చేస్తామని, ఈ ప్రాజెక్టుకు ఎలాం టి ముప్పు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల మెయింటినెన్స్‌ను, నీటిపారుదల శాఖల ను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా రిపేర్లు చేస్తూ వస్తున్నామని అన్నారు. జూరాల ప్రాజెక్టు దగ్గర ఎలాం టి ఇబ్బంది లేకున్నా ప్రతిపక్షాలు కావాలని ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.

దశాబ్దకాలం నుండి జూరాల ప్రాజెక్టు దగ్గర గ్యాంటీ క్రేన్ అవసరం ఉందని డిమాండ్ ఉన్నప్పటికీ పట్టించుకోని గత పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కానీ ఆ నేతలు ఇప్పుడు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 90% కంప్లీట్ అయిన నెట్టెంపాడు ప్రాజెక్టును పూర్తిచేయలేని దద్దమ్మ ప్రభుత్వం బిఆర్‌ఎస్ సర్కార్ అని మండిపడ్డారు. ర్యాలంపాడు రిజర్వాయర్ కూడా రిపేర్లు చేసి 4 టిఎంసిల నీరు నిల్వ ఉంచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పదేళ్ల్ల బిఆర్‌ఎస్ పాలనలో ఇరిగేషన్ శాఖను బ్రష్ఠుపట్టించారని మండిపడ్డారు. వారి పాలనలో ప్రాజెక్టులు కొత్తవి కట్టకపోగా, పాత వాటిని మూలకు వేశారని ఆరోపించారు. జూరాల ప్రాజెక్టు కెపాసిటీ తగ్గిపోయిందని, దానిని పెంచేందుకు పూడికతీత పనులను కూడా చేపడతామని అన్నారు. జూరాల ప్రాజెక్టు పర్యటనకు వచ్చిన మం త్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరిలకు స్థా నిక ఎంఎల్‌ఎ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఘన స్వా గతం పలికారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి గద్వాలకు చేరుకోగా హెలిపాడ్ దగ్గర చేరుకున్న ఎంఎల్‌ఎ, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ సరిత తిరుపతయ్య స్వాగతం పలికారు.

ముందుగా ర్యాలంపాడు రిజర్వాయర్‌కు
భారీ నీటి పారుదల శాఖ మంత్రి ముందుగా గద్వాల చేరుకొని అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టుకు వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఉంది. కానీ ఆకస్మాత్తుగా స్థానిక ఎంఎల్‌ఎ కోరిక మేరకు మంత్రి తన పర్యటనలో మార్పు చేసుకొని ముందుగా ర్యాలంపాడు రిజర్వాయర్ దగ్గరికి వెళ్లి అక్కడ లీకేజీని పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా జూరాలకు చేరుకొని గేట్లను పరిశీలించారు. ఆ తర్వాత గద్వాల కలెక్టరేట్‌కు చేరుకొని ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌ఎలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మేఘా రెడ్డి, పర్ణికా రెడ్డి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, సిఇ సత్యనారాయణ రెడ్డి, ఎస్‌సి రహీముద్దీన్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News