Friday, June 6, 2025

పాక్‌కు గూఢచర్యం.. మిలియన్ సబ్‌స్ర్కైబర్స్ ఉన్న యూట్యూబర్‌ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్‌కు దేశ భద్రతకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని చేరవేస్తున్నాడనే ఆరోపణతో జస్బీర్ సింగ్ అనే యూట్యూబర్‌ని (Youtuber) పంజాబ్ పోలీసులు అరెస్ట్ (Arrest) చేశారు. ‘జాన్ మహల్’ అనే పేరుతో జస్బీర్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. ఆ ఛానల్‌కి 1.1 మిలియన్ల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. అయితే నిందితుడికి పాకిస్థాన్ ఇంటెలిజన్స్ అధికారి, ఐఎస్ఐకు పని చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న షకీర్ అలియాస్ జుట్ రాంధావాతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. పాక్ రాయబార కార్యాలయ అధికారి ఎహసాన్ ఉర్ రహిం అలియాస్ డానిష్‌తో కూడా ఇతనికి పరిచయం ఉంది. అంతేకాక.. ఇటీవల గూఢచర్యం కేసులో అరెస్ట్ (Arrest) అయినా హరియానా యూట్యూబర్ (Youtuber) జ్యోతి మల్హోత్రాతో కూడా ఇతనికి దగ్గర సంబంధాలు ఉన్నట్లు తేలింది.

డానిష్ ఆహ్వానం మేరకు ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో జరిగిన జాతీయ దినోత్సవానికి కూడా జస్బీర్ హాజరైనట్లు పోలీసులు తెలిపారు. అంతేకాక నిందితుడు 2020, 21, 24లో పాకిస్థాన్‌లో పర్యటించాడని పేర్కొన్నారు. నిందితుడి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటిని ఫారెన్సిక్ లాబ్‌కు తరలించగా.. శతృదేశానికి చెందిన అనేక నెంబర్లు బయటపడ్డాయని తెలిపారు. జ్యోతి అరెస్టు నేపథ్యంలో వాటిని తొలగించేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయని.. దీనిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News