మన తెలంగాణ/అమరావతి: ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కో ర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను జేఎన్టీయూ- కాకినాడ వీసీ ఆచార్య సీఎస్ఆర్కే ప్రసాద్ ఆదివారం సాయత్రం విడుద ల చేశారు. ఈ పరీక్షల్లో 75.67శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన వెల్లడించారు. ఈఏపీసెట్ నిర్వహించిన కేవ లం 12 రోజుల్లోనే ప్రభుత్వం ఈ ఫలితాలను విడుదల చేయడం విశేషం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో మొత్తంగా 145కేంద్రాలలో నిర్వహించిన ఈ పరీక్షకు 3,62,448 మంది దరఖాస్తు చేసుకోగా 3,40,300 మం ది హాజరైనట్లు వెల్లడించారు. వీరిలో 2,57,509మంది (75.67శాతం ఉత్తీర్ణత) అర్హత సాధించారని వెల్లడించారు. పరీక్షలు నిర్వహించిన స్వల్ప వ్యవధిలోనే ఫలితాలు విడుదల చేయ డం పట్ల వీసీ హర్షం వ్యక్తం చేశారు. ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మే 19 నుంచి 20వరకు అగ్రికల్చర్, ఫార్మా విభాగానికి నాలుగు సెషన్లలో పరీక్ష నిర్వహించగా 75,460మంది విద్యార్థులు హాజరయ్యారు.
వీరిలో 67, 761 మంది (89.80శాతం) అర్హత సాధించారు. అలాగే, మే 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ విభాగానికి 10 సెషన్లలో జరిగిన పరీక్షకు 2,64, 840మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 1,89,748మంది (71.65 శాతం) అర్హత సాధించారు. ఏపీ ఈఏపీసెట్ ఈ ఫలితాల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ – ఫార్మసీ విభాగాల్లో పలురువు విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టారు. ఇంజినీరింగ్ విభాగంలో హైదరాబాద్ వనస్థలిపురానికి చెందిన అవనగంటి అనురుధ్ రెడ్డి ఒకటో ర్యాంకు (96.39 స్కోరు) సత్తా చాటగా తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మాండవ్యపురం భాను చరణ్ రెడ్డి (95.57 స్కోరు) రెండో ర్యాంకు, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ (94.75స్కోరు) తో మూడో ర్యాంకుతో మెరిశారు. యు. రామచరణ్ రెడ్డి నాలుగో ర్యాంకు (తిమ్మాపురం, నంద్యాల జిల్లా), భూపతి నితిన్ అగ్నిహోత్రి – ఐదో ర్యాంకు (అనంతపురం న్యూటౌన్), టి.విక్రమ్ లేవి – ఆరో ర్యాంకు (గుంటూరు), దేశిరెడ్డి మణిదీప్ రెడ్డి – ఏడో ర్యాంకు (చిత్తూరు జిల్లా) , ఎస్. త్రిశూల్ – ఎనిమిదో ర్యాంకు (వడ్డేపల్లి, హన్మకొండ), ధర్మాన జ్ఞాన రుత్విక్ సాయి – తొమ్మిదో ర్యాంకు (నరసన్నపేట- శ్రీకాకుళం), భద్రిరాజు వెంకటమణి ప్రీతమ్ – పదో ర్యాంకు ( కందుకూరు- పొట్టిశ్రీరాములు నెల్లూరు) సాధించారు.’
అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో టాపర్లు వీరే
1. రామాయణం వెంకట నాగసాయి హర్షవర్దన్- (పెనమలూరు, కృష్ణా జిల్లా)
2. షన్ముఖ నిశాంత్ అక్షింతల – చందానగర్, రంగారెడ్డి జిల్లా
3. డేగల అకీరనంద వినయ్ మల్లేశ్ కుమార్ – ఆలమూరు, కోనసీమ
4. వై.షణ్ముఖ్ – వడ్డేపల్లి, హన్మకొండ
5. యెలమోలు సత్య వెంకట్ – తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి
6. సిరిదెళ్ల శ్రీ సాయి గోవర్దన్ – పెద్దాపురం, కాకినాడ
7. జి. లక్ష్మీ చరణ్ – సీతమ్మధార, విశాఖ
8. దర్భ కార్తిక్ రామ్ కిరీటి- రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి
9. కొడవటి మోహిత్ శ్రీరామ్ – చాగళ్లు, తూర్పుగోదావరి
10. దేశిన సూర్య చరణ్ – తొండంగి, కాకినాడ