Thursday, September 18, 2025

ఏపిలో తెలంగాణ ఉద్యోగులకు ఎన్నికల సెలవు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః తెలంగాణలో ఓటు హక్కు కలిగిన ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం గురువారం సెలవును ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉండటంతో ఏపిలో ఉద్యోగం చేస్తున్న పలువురికి తెలంగాణలో ఓటు హక్కు ఉంది. అలాంటి వారికి జగన్ ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసింది. సచివాలయ ఉద్యోగుల సంఘం వినతి మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సెలవు మంజూరు చేశారు. తెలంగాణలో ఓటు హక్కు కలిగిన ఉద్యోగులు సరైన ఆధారాలు చూపించి సెలవు పొందవచ్చునని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News