ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి లిక్కర్ స్కాం (AP liquor case) కేసులో మాజీ అధికారులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిఐడి సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఉదయం వీరిద్దరికీ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరిం చింది. కేసు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. వారికి వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
ప్రస్తుతం బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేస్తే దిగువ కోర్టులు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గతంలో సుప్రీంకోర్టు అరెస్టు నుంచి మినహాయిం పు ఇచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం వరకు అరెస్ట్ చేయకూడదనే ఆదేశా లు ఉండటంతో ఈ మూడ్రోజులు వారిని సిట్ ఆఫీసులో విచారించారు. సుప్రీం విధించిన గడువు ముగియడంతో ఆ ఇద్దరిని విచారణ తర్వాత అరెస్టు చేస్తున్నట్లుగా ప్రకటించారు. వైసిపి హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కాం కేసులో నాటి సిఎంఒ కార్యదర్శి ధనుంజయ్రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను ఇటీవల సిట్ నిందితులుగా చేర్చింది.
వీరిద్దరూ తమ కుటుంబసభ్యుల పేర్లతో కంపెనీలు పెట్టి మద్యం సొమ్మును చెలామణిలోకి తీసుకు వచ్చారని ఎపి సిఐడి అధికారులు అనుమానిస్తున్నారు. డబ్బు ల తరలింపులో వీరిది కీలక పాత్ర అని చెబుతున్నారు. వీరిద్దరినీ అరెస్టు చేసి కస్టడీకి తీసుకుంటే చెప్పే వివరాలు మాజీ సీఎం జగన్కు ఇబ్బంది కరంగా మారుతాయన్న అభిప్రా యం వినిపిస్తోంది. గతంలో విజయసాయిరెడ్డి లిక్కర్ స్కాంపై (AP liquor case) జరిగిన సమావేశాలకు వీరిద్దరూ హాజరయ్యార ని మీడియా ముందు చెప్పారు. సిఐడి అధికారులకు కూడా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ధనుంజయ్ రెడ్డి మాజీ ఐఏఎస్ అధికారి. వైసిపి ఓడిపోయే ముందు రోజునే ఆయన పదవి కాలం పూర్తి అయింది. ఐఎఎస్గా చేసి మద్యం స్కాంలో జైలుకెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.