విశాఖపట్నం: భారతీయ మూలాలున్న యోగా ప్రపంచ వ్యాప్తమైందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీకి ఎపి సిఎం చంద్రబాబు నాయుడు జ్ఞాపికను బహుకరించారు. యోగా చేసిన అనంతరం బాబు ప్రసంగించారు. 12 లక్షల ప్రాంతాల్లో యోగా చేస్తున్నారని, 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒక రికార్డు నెలకొల్పబోతోందన్నారు. సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభం అవుతుందని, 2.17 కోట్ల మంది యోగా కోసం ఎన్రోల్ చేసుకున్నామన్నారు. గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డు సృష్టించారని ప్రశంసించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ సాగర తీరాన జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. జాతి, కుల, మతాలకు అతీతంగా యోగాని పాటిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్కు, మంత్రి లోకేష్, ప్రజలు హాజరయ్యారు.
సూర్య నమస్కారాలతో రికార్డు సృష్టించాం: బాబు
- Advertisement -
- Advertisement -
- Advertisement -