Tuesday, June 3, 2025

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఎపిలో తొలి కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మహమ్మారి కోవిడి 19 వైరస్ విజృంభిస్తోంది. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇండియాలోనూ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఎపిలోని విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు. దీంతో ఆమెతో పాటు భర్త, పిల్లలకు ఆర్టీపిసిఆర్ పరీక్షలు చేశారు. అనంతరం వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. ఇన్నాళ్లకు మళ్లీ రాష్ట్రంలో కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. బాధితుతల చుట్టుపక్కల వారందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, మహారాష్ట్రలో ఇప్పటికే 100కు పైగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇద్దరు మరణించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఇటీవల వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News