Sunday, June 8, 2025

రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ

- Advertisement -
- Advertisement -

రేపటి నుంచి చేప మందును పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం, సోమవారం రెండురోజుల పాటు ఈ మందును పంపిణీ చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌం డ్స్‌లో ఉదయం తొమ్మిది గంటల నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేసేందుకు 32 కౌంటర్లను ఏర్పాటు చేశారు. మృగశిర కార్తె సందర్బంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తుల కోసం ప్రతి యేటా బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించే చేప మందు పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8, 9 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించేందుకు జిహెచ్‌ఎంసి, మత్యశాఖ, ఆర్ అండ్ బి, వాటర్ వర్క్, విద్యుత్, పోలీస్, ట్రాఫిక్, రెవెన్యూ తదితర శాఖ ల అధికారులు సమన్వయంతో చేప మందు కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు పూర్తిచేశారు. నేడు(ఆదివారం) ప్రారంభించే చేపమందు కోసం వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే అస్తమా రోగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

చేప మందు కోసం లక్షలాది గా తరలివచ్చే అవకాశం ఉన్నందున లా అండ్ ఆర్డర్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చేప మందు పంపిణీ కోసం లక్షన్నర చేప పిల్లలను అందుబాటులో ఉంచనున్నట్లు మత్యశాఖ అధికారులు పేర్కొన్నారు.అయితే, ఐదు లక్షల మంది చేపమందు చేసుకునేందుకు రావచ్చని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు బత్తిన సోదరులు,అధికారవర్గాలు పేర్కొంటున్నారు. వందలాది మంది ఉత్తర భారతీయులు చేప మందు కోసం 2 రోజుల ముందుగానే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకుని, చేపమందు కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో సేద తీరుతున్నారు. దీంతో వివిధ స్వచ్చంధ సంస్థలు ఇతర రాష్ట్రాల నుండి చేప మందు కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివచ్చిన అస్తమా రోగులు, వారి సహాయకులకు భోజన సదుపాయం కల్పిస్తున్నాయి. మొత్తం 32 కౌంటర్ల ద్వారా చేపమందు పంపిణీకి సన్నాహాలు చేస్తుండగా, మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్యూ లైన్‌లు ఏర్పాటు చేసి, వృద్దులు, వికలాంగులు, చిన్నారులతో పాటు విఐపిలకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా చేపమందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

చేపమందు పంపిణీ సందర్బంగా ప్రజల సౌకర్యార్దం మొబైల్ టాయి లెట్లను ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ద నిర్వహణ కోసం 3 షిప్టుల్లో 300 మంది పారిశుద్ద సిబ్బంది అందుబాటు లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి షిప్టుకు 100 మంది పారిశుద్ద సిబ్బందితో నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించనుండగా, జలమండలి అ ధికారులు లక్షలాది మంచినీటి ప్యాకెట్ల పంపిణీ కోసం ఏర్పాట్లు చేశారు. అన్ని ప్రధాన ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News