Thursday, May 29, 2025

ఐదు లక్షల మంది..రూ.8వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ఆవిర్భావ కానుకగా రాజీవ్ యువవికాసం జూన్ 2 నుంచి 9
వరకు మంజూరు పత్రాల పంపిణీ జూన్ 10 నుంచి 15 వరకు
లబ్ధిదారులకు శిక్షణ జూన్ 15 తరువాత యూనిట్ల గ్రౌండింగ్
అక్టోబర్ 2 నాటికి 5 లక్షల మంది లబ్ధ్దిదారులకు దశలవారీగా లబ్ధి
తొలుత లక్షలోపు యూనిట్లకు ప్రొసీడింగ్స్ : డిప్యూటీ సిఎం భట్టి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు సాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సంబంధి త అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాజీ వ్ యువ వికాసం పథకం అమలు ప్రగతిని డి ప్యూటీ సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా అ ధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. నిరుద్యోగ యువత ఆశలను ముందుకు తీసుకు వెళ్లే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ ప్రతిష్టాత్మకంగా భా వించి రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చిందని అధికారులకు సూచించారు. జూన్ 2 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో రాజీవ్ యువ వికాసం పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థా యిలో ఓకే సారి రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జూన్15 తర్వాత గ్రౌం డింగ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించా లి అన్నారు.

తెలంగాణ  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండు నాటికి లక్ష్యంగా పెట్టుకున్న ఐదు లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఆదేశించారు. ప్రతి నెలా ఈ కార్యక్రమం చేపట్టి దశలవారీగా పూర్తి చేయాలని, జిల్లా ఇన్చార్జి మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు రాజీవ్ యువ వికాసంలో వారికి అవకాశం కల్పించేలా చూడాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. సంక్షేమ శాఖల కార్పొరేషన్ చైర్మన్లకు రాజీవ్ వికాసం కింద అవకాశం కల్పించాలంటూ యువత దరఖాస్తులు చేసుకున్నారు, ఆ దరఖాస్తులన్నింటినీ పరిశీలించి సంబంధిత జిల్లా కలెక్టర్లకు వెంటనే పంపేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గత పది సంవత్సరాల కాలంలో సంక్షేమ శాఖలను, రాష్ట్ర యువతను గాలికి వదిలేశారని డిప్యూటీ సీఎం అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో సంక్షేమ శాఖల ద్వారా ఆయా వర్గాలకు అందిన మొత్తాన్ని ప్రజా ప్రభుత్వం కేవలం ఒక్క సంవత్సరంలో రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఆయా వర్గాల యువతకు చేయూతనిస్తుంది అన్నారు.

దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు, ఏ రాష్ట్రంలోను ఒక సంవత్సరంలో స్వయం ఉపాధి కోసం ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేసిన దాఖలాలు లేవని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఇంతటి గొప్ప కార్యక్రమం ఇందిరమ్మ రాజ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ద్వారానే సాధ్యమైందన్నారు. ఈ పథకాన్ని విజయవంతం చేయడం కోసం వారం క్రితమే ఎస్ ఎల్ బి సి సమావేశం నిర్వహించామని, ఆ తరువాత సంక్షేమ శాఖ అధికారులు బ్యాంకర్లతో తరచూ మాట్లాడుతూ ఈ స్వయం ఉపాధి పథకాన్ని చివరి దశకు చేర్చారని అభినందించారు. వెంటనే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జూన్ 2న శాంక్షన్ లెటర్ల పంపిణీ కార్యక్రమం విజయవంతమ య్యేందుకు అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. హై లెవెల్ కమిటీ సమావేశంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ యాస్మిన్ భాషా, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News