అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ అంటే ఓ హుందాతనం ఉండాలి. తన ప్రవర్తన యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలవాలి. కానీ, భారత మాజీ స్పిన్నర్ అశ్విన్ (Ashwin) మాత్రం ఓ క్రికెట్ మ్యాచ్లో ప్రవర్తించిన తీరుపై సర్వత్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తనను ఔట్గా ప్రకటించిన అంపైర్ అందులోనూ ఓ మహిళపై (Female Umpire) అశ్విన్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో అశ్విన్పై నెటిజన్లు మండిపడుతున్నారు.
తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025లో అశ్విన్ (Ashwin) దిండిగల్ డ్రాగన్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. సోమవారం ఐడ్రీమ్ తిరుప్పుర్తో దిండిగల్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్లో అశ్విన్ ఓపెనర్గా దిగాడు. సాయి కిషోర్ ఓవర్లో అశ్విన్ స్విప్ షాట్ ఆడబోయి బంతిని మిస్ చేశాడు. దీంతో బంతి ప్యాడ్స్కి తగిలింది. వెంటనే బౌలింగ్ టీం అప్పీల్ చేయగా.. అంపైర్ దాన్ని ఔట్గా ప్రకటించారు. దాంతో అశ్విన్ ఆగ్రహంతో మహిళ అంపైర్తో (Female Umpire) వాగ్వాదానికి దిగారు. అంపైర్ పట్టించుకోకపోవడంతో అశ్విన్ అసహనంతో బ్యాట్ను ప్యాడ్స్కి కొట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ‘‘అశ్విన్ నీ స్థాయికి ఇది తగునా’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తిరుప్పుర్ బౌలర్లు ఎసక్కిముత్తు(4 వికెట్లు), మతివణ్ణన్(3 వికెట్లు), సాయి కిషోర్(2 వికెట్ల) అద్భుతంగా రాణించడంతో దిండిగల్ జట్టు 16.2 ఓవర్లలో 93 పరుగులకు అలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన తిరుప్పుర్.. తుషార్ రహేజా (39 బంతుల్లో 65) అర్థశతకంతో చెలరేగడంతో 11.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.