వృద్ధ రైతుతో దురుసుగా ప్రవర్తించిన ఏఎస్సై రాంచందర్ ను సస్పెండ్ చేశారు. బుధవారం రాంచందర్ను సస్పెండ్ చేసినట్లు ఎస్పి జానకీ షర్మిల ప్రకటించారు. నిర్మల్ పోలీసులు ప్రజలతో దగ్గరవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇలాంటి దరుసు ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లో సహించేదిలేదని.. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాంచందర్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. కాగా, నిన్న
ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో జరిగిన రైతు, భూభారతి సదస్సులో తన సమస్య చెప్పుకునేందుకు వెళ్లిన వృద్ధ రైతుతో ఏఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. ఎమ్మార్వో ఆఫీసుకు వచ్చి వృద్ధ రైతు మాట్లాడుతుండగా.. ఎమ్మెర్వో అతన్ని పంపించండని అక్కడే ఉన్న ఏఎస్సై రాంచందర్ కు చెప్పాడు. దీంతో కనికరం లేకుండా ఎమ్మార్వో ఆఫీసు నుండి ఆ వృద్ధ రైతును రాంచందర్ బయటకు ఈడ్చుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్పందించిన అధికారులు సదరు ఏఎస్సైని సస్పెండ్ చేశారు.
వృద్ధ రైతుతో దురుసు ప్రవర్తన.. ఏఎస్ఐ రాంచందర్ సస్పెండ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -