- Advertisement -
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసుల వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు. ఈ ఘటనలో కొంటా డివిజన్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) ఆకాష్ రావు గిర్పుంజే మృతి చెందారు. ఈ ఘటన కొంటా-ఎర్రబోర్ రోడ్డులోని డోండ్రా సమీపంలో జరిగింది.
జూన్ 10న CPI (మావోయిస్ట్) భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నక్సలైట్ కార్యకలాపాలను నిరోధించడానికి వచ్చిన ఫుట్ పెట్రోల్ బృందం వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు. ఈ వాహనంలో ASP గిర్పుంజే కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ఆపరేషన్ చేపట్టగా.. ప్రెజర్-యాక్టివేటెడ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (IED) పేలుడులో పెట్రోల్ బృందం చిక్కుకుంది. ఇందులో తీవ్రంగా గాయపడిన ఏఎస్పి చనిపోగా.. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -