Sunday, June 29, 2025

ప్రియుడితో కలిసి భర్తను కారుతో ఢీకొట్టి

- Advertisement -
- Advertisement -

పాట్నా: ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను కారుతో ఢీకొట్టి హత్య చేసింది. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం ఔరంగాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లాలా అమునా గ్రామంలో బిక్కు, పూజా అనే దంపతులు నివసిస్తున్నారు. మెడిసిన్ తీసుకొందామని చెప్పి భర్తను భార్య గయాజీకి తీసుకెళ్లింది. గయాజీ నుంచి వస్తుండగా భర్తను ప్రియుడు కమలేశ్ యాదవ్ కారుతో ఢీకొట్టి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తన ప్రియుడితో కలిసి హత్యచేశానని ఒప్పుకుంది. ప్రియుడి, ప్రియురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నెల రోజుల క్రితం ఇదే ప్రాంతంలో గతంలో పుచ్చకాయలో విషం కలిపి భర్తను భార్య చంపేసిన తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News