8మంది మృతి.. దుండగుడి ఆత్మహత్య
న్యూఢిల్లీ: ఆస్ట్రియాలోని గ్రాజ్ నగరంలో ఒక స్కూల్లో విద్యా ర్థి కాల్పులు జరపడం కలకలం రేపింది. ఓ విద్యార్థి జరిపిన కా ల్పులలో 8 మంది చనిపోయారు. తర్వాత కాల్పులు జరిపిన వి ద్యార్థి కూడా వాష్ రూప్ లో ఆత్మహత్య చేసుకుని కన్పించాడని ఆస్ట్రియా మీడియా తెలిపింది. గ్రాజ్ నగరంలోని బోర్గ్ డ్రీ యర్ షుట్టెమ్ గాస్పే స్కూల్ లో ఈ ఘటన జరిగింది. కాల్పుల లో గా యపడిన టీచర్ తో సహా చాలామందిని ఆస్పత్రికి తరలించి చి కిత్స చేస్తున్నామని గ్రాజ్ నగర మేయర్ ఎల్కే కహార్ తెలిపారు. ఇది అత్యంత దారుణమైన విషా దం అని ఆమె అభివర్ణించారు.
ఉదయం 10గంటల ప్రాంతంలో పాఠశాలనుంచి కాల్పుల శబ్దాలురావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాల్పులలో తీవ్రంగా గాయపడిన వారిలో విద్యార్థులు, టీచర్లు కూడా ఉన్నారని వార్తాసంస్థ పేర్కొంది. ఈ ఘటన జరగగానే, స్కూల్ నుంచి విద్యార్థులను పంపివేసి , ఆ ప్రాంతంలో భద్రత పెంచారు. బాధితులకు వైద్యసిబ్బంది చికిత్స అందిస్తున్నారు. బంధువులు వారికి సహకరిస్తున్నారని స్థానికపోలీసు అధికారి తెలిపారు. కాల్పుల సమయంలో విద్యార్థులను రక్షించేందుకు టీచర్లు ప్రయత్నించి వారు గాయపడ్డారు. పదేళ్ల క్రితం, 2015 జూన్ 20న గ్రాజ్ నగరంలో కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఆ తర్వాత స్కూల్ లో కాల్పులు జరగడం ఇదే ప్రథమం.