Tuesday, June 17, 2025

శ్రీశైలం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

ఎపిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తుండగా ఆటో బోల్తా పడి అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని వారిని చికిత్స కోసం  ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని ఆదోనికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News