Thursday, June 12, 2025

వైద్యుల నిర్లక్ష్యంతో మాతాశిశు కేంద్రంలో పసికందు మృతి

- Advertisement -
- Advertisement -

వైద్యుల నిర్లక్ష్యంతో మాతాశిశు కేంద్రంలో పసికందు మృతి చెందన సంఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో చోటుచేసుకుంది. సుద్దపల్లికి చెందిన రాజు, జ్యోత్స్న దంపతులకు మాతాశిశు కేంద్రంలో శనివారం బాబు జన్మించాడు. శిశువు అనారోగ్యంతో ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఆదివారం ప్రైవేటు ఆసుపత్రికి తరలించమని విధుల్లో ఉన్న వైద్యురాలు తల్లిదండ్రులను సూచించింది. దీంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో తిరిగి మాతాశిశు కేంద్రానికి తరలించే సమయంలో శిశువు మరణించింది.

మాతాశిశు కేంద్రంలోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే తమ బాబు మరణించాడని ఆసుపత్రి ఎదుట తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకొని వైద్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News