అనేక మంది ఉసురుపోసుకున్నాడు
ఆయన వెనక వున్న
సూత్రధారులను దోషులుగా
తేల్చాలి పథకం ప్రకారమే
లొంగుబాటు డ్రామా
కేంద్రమంత్రి బండి సంజయ్
తీవ్ర ఆరోపణలు
మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూరోః ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మామూలోడు కాదని కేంద్ర హోంశాఖ సహాయ మం త్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లా, చొప్పదండి ని యోజకవర్గంలో సోమవారం పర్యటించిన సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభాకర్రావు మాలాంటి అనేకమంది కార్యకర్తల ఉసురుపోసుకున్నాడు’ అని మండిపడ్డారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు కెసిఆర్ కుటుంబంతో కౌన్సెలింగ్ తంతు పూర్తయిందని అన్నారు. పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారని పేర్కొన్నారు. విచారణలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను బహిరంగ పర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందుకంటే సిఎం రేవంత్ రెడ్డిపైనే కాదు… తనతోపాటు కాం గ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ నేతలు, జడ్జీల ఫోన్లను కూడా ట్యా ప్ చేసిన ఘనుడని అన్నారు. ‘ప్రభాకర్రావు వల్ల అనేకమంది జీవితాలు నాశనమైనయ్..ఎన్నో కుటుంబాలు రో డ్డున పడ్డాయ్’ అని అన్నారు.
భార్యాభర్తలు మాట్లాడుకున్న సంభాషణలను కూడా ట్యాప్ చేసిన నీచుడు…ఆయన వల్ల భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకో లేని దుస్థితిని కల్పించారన్నారు. ఎవరి ఆదేశం మేరకు ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారో ప్రజలకు తెలియాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటిని ఏం చేశారు? ట్యాపింగ్ ఆడియోలను ఎవరికి పంపారు. ఆ ఆడియోలను అడ్డుపెట్టుకుని ఎవరెవరిని బెదిరించారు? కోర్టు నిబంధనలకు లోబడే ప్రభాకర్ రావుపై సీరియస్గా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందని, 18 నెలల పాలనలో ఏ ఒక్క అవినీతి కేసులో విచారణ కూడా ముందుకు సాగలేదని అన్నారు. ఇకనైనా కోర్టులో గట్టిగా వాదనలు వినిపించాలని, ప్రభాకర్ రావు సహా ఆయన వెనుకున్న సూత్రధారులను దోషులుగా తేల్చాల్సిందేనని అన్నారు.