Sunday, June 22, 2025

ఆ విషయంలో బిజెపిపై తప్పుడు ప్రచారం చేయడం తగదు: బండి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బిజెపిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి సర్కార్ రక్షణ కవచంగా మారిందని ఆరోపణలు చేశారు. కరీంనగర్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో ముచ్చటించారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ రూపాయి నాణేనికి బొమ్మా బొరుసు లాంటివని విమర్శలు గుప్పించారు. అందుకే కెసిఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆధారాలున్నా అరెస్ట్ చేయడం లేదని సిఎం రేవంత్ రెడ్డికి చురకలంటించారు. కాళేశ్వరంపై  బిజెపి స్టాండ్ వెరీ క్లియర్ గా ఉందని, పిఎం మోడీ స్టాండే బిజెపి స్టాండ్ అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ఊసరవెల్లి మాదిరిగా విధానాలు మార్చుకునే పార్టీ బిజెపి కాదని వివరించారు. కాళేశ్వరం కెసిఆర్ కుటుంబానికి ఎటిఎంగా మారిందన్నది నగ్న సత్యమన్నారు. 10 ఏళ్లు నీతివంతమైన పాలన చేసిన మోడీ ఏ ఆధారాల్లేకుండా కెసిఆర్ కుటుంబానికి కాళేశ్వరం ఎటిఎంగా మారిందని చెబుతారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాళేశ్వరం పూర్తి అవినీతిమయమైన ప్రాజెక్టు అని 38 వేల కోట్ల ప్రాజెక్టును 1.2 లక్షల కోట్ల అంచనాలు పెంచి కెసిఆర్ దోచుకున్నది ముమ్మాటికీ నిజం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన కొందరు అధికారులు వందల కోట్లు సంపాదించారంటే ఎంత అవినీతి జరిగిందో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.  అధికారులనే బలి చేసి కెసిఆర్ కుటుంబాన్ని కాపాడతామంటే ఎట్లా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ నిలదీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News